
రేవంత్రెడ్డి పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత కేటీఆర్ జన్వాడ ఫామ్హౌస్ను డ్రోన్తో చిత్రీకరించారంటూ నమోదైన కేసును, ఎల్బీనగర్ కోర్టులో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసులు నమోదయ్యాయి.
వాటిని కొట్టివేయాలని కోరుతూ రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు.