- సహకరిస్తున్న మంత్రి వివేక్కు ధన్యవాదాలు
- లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండరాం
గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో గడ్డం కళావతి, వెంకటస్వామి మెమోరియల్ట్రస్ట్ద్వారా గోదావరిఖనిలో ఇప్పటివరకు1,212 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారని, ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్సింహరాజు కోదండరాం తెలిపారు. అధికారిక పర్యటనలో భాగంగా లయన్స్ క్లబ్ గవర్నర్ పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో ఆదివారం 31 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. గతంలో రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లి కృత్రిమ అవయవాలు పెట్టుకునేవారని, కానీ నేడు రామగుండం లయన్స్ క్లబ్ ఆవరణలోనే వాటిని అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అంతకుముందు స్థానిక లక్ష్మినగర్లేబర్అడ్డాలో అల్ఫాహార వితరణ, లయన్స్ భవన్లో కుట్టు మెషీన్ల పంపిణీ, ఎన్టీపీసీ మేడిపల్లి సాయిసేవా సమితిలో 50 కేజీల బియ్యం, స్టూడెంట్లకు స్టీల్ప్లేట్లు, శాలపల్లి, ఎల్కలపల్లి గేట్, పద్మావతి నగర్లో సిమెంట్ బెంచీలు, లక్ష్మిపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి దుస్తుల పంపిణీ, మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ చేశారు. గాంధీనగర్లోని గోశాలలో ఆవులకు ఎండు గడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా లయన్స్గవర్నర్ కోదండరాం మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవలో ముందు భాగాన నిలిచారని, ఇతర లయన్స్ క్లబ్బులకు ఆదర్శంగా సమాజ అవసరానికి అవసరమైన సేవలు చేస్తున్నారని కొనియాడారు.
ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ డిస్ట్రిక్ట్గవర్నర్ ఎం.ప్రమోద్కుమార్ రెడ్డి, అధ్యక్షుడు వడ్లకొండ ఎల్లప్ప, సెక్రటరీ ముడతనపల్లి సారయ్య, ట్రెజరర్ రాజేంద్రకుమార్, జోన్ చైర్మన్ పి.మల్లికార్జున్, రీజియన్ చైర్మన్ కె.రాజేందర్, సీనియర్లయన్మెంబర్స్మినేష్ నారాయన్ టండన్, మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, పోకల ఆంజనేయులు, శరత్ బాబు, సత్యనారాయణ, రమణయ్య, భేణి గోపాల్ త్రివేది, మనోజ్ కుమార్ అగర్వాల్, కోలేటి శ్రీనివాస్, దొమ్మేటి తిరుపతి, తానిపర్తి గోపాల్రావు, అధిక సంఖ్యలో లేడి లయన్స్ పాల్గొన్నారు.
