హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజ యం సాధించిన విజయుడు ఎన్నికను సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
‘ఉండవల్లి మండలం పుల్లూర్ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచే స్తున్న విజయుడు రిజైన్ చేయకుండా నే నామినేషన్ దాఖలు చేశారని, ఎన్నికల నియమా వళి ప్రకారం ప్రభుత్వంలో పనిచేసిన వారు ఎవరైనా ఆ వివరాలను ఎన్నిక ల అఫిడవిట్లో పేర్కొనాలని, విజయుడి ఎన్ని క చెల్లదని ప్రకటించాలి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీ విజయసేన్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు చేయాలని విజయుడికి నోటీసులు జారీ చేశారు.