ఎల్​ఆర్​ఎస్​పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

ఎల్​ఆర్​ఎస్​పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం

విచారణ వచ్చే నెల 5కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర సర్కార్‌ ఆగస్టు 31న జీవో 131 జారీ చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన కె.ప్రసాదరావు వేసిన ఈ పిల్‌ను సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్‌ విచారించింది. ప్రతివాదులైన సీఎస్, మున్సిపల్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌/పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్లు తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్‌ వేయాలని నోటీసులు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ గడువును సర్కార్ ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిటిషనర్‌ న్యాయవాది చెప్పారు. అసలే కరోనా, ఇప్పుడు వరదలతో జనం అల్లాడిపోతుంటే ఈ నెలవరకూ గడువు ఎలా సరిపోతుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్తానని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు.. అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ గతంలో దాఖలైన పిల్స్‌తో దీనిని కూడా జత చేసి నవంబర్‌ 5న విచారిస్తామని ప్రకటించింది.

For More News..

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య

బిడ్డ పుట్టిందని డివోర్స్ అడిగిన జవాన్

144 సెక్షన్​లో వివక్ష.. మీడియాకు, ప్రతిపక్షాలకు నో పర్మిషన్