శివ స్వాములు మాలలు తీసి వస్తేనే  జైల్లోకి అనుమతి: జైలు సిబ్బంది

శివ స్వాములు మాలలు తీసి వస్తేనే  జైల్లోకి అనుమతి: జైలు సిబ్బంది

మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో 5 మంది శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ రోజు వారిని రిమాండుకు తరలించేందుకు తాండూరు పోలీసులు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శివ స్వాములు మాలలు తీసేసి వస్తేనే  జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారిని జైల్లోకి తీసుకెళ్లి పోలీసులు మళ్ళీ జైలు బయటే కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారని శివ స్వాములు ఆరోపించారు. మాలలు తీసే ప్రసక్తి లేదని శివస్వాములు తేల్చి చెప్పగా.. పోలీసులు ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. ఈ క్రమంలో మీడియాతో సహా అందర్నీ జైలు ఆవరణ నుంచి పోలీసులు పంపించేశారు. ఆ తర్వాత రిగి ఎస్సై విఠల్ రెడ్డి జైలు సిబ్బందితో మాట్లాడి, శివస్వాములను జైల్లోకి పంపడంతో హైడ్రామా అంతటితో ముగిసిపోయింది.

శివస్వాములతో పాటు యంగ్ రీడర్స్ వ్యవస్థాపకుడు -మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ ను కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు. శివస్వాములను రెచ్చగొట్టి, హింసకు ప్రేరేపించాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గతంలో యంగ్ లీడర్స్ స్థాపించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కారణం కాగా.. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే తో పొసగక బీజేపీలో చేరారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనను కేసులో ఇరికించారంటున్న మురళీ కృష్ణ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.