సింగూరు కాల్వల ఈపీసీ టెండర్ రద్దు!

సింగూరు కాల్వల  ఈపీసీ టెండర్ రద్దు!
  • హైపవర్ కమిటీ మీటింగ్​లో నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్ కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సెక్రటేరియెట్​లో జరిగిన హైపవర్ కమిటీ (హెచ్ పీసీ) మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2005లో ఈపీసీ పద్ధతిలో కుడి, ఎడమ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం రూ.84.45 కోట్లతో టెండర్​ పిలిచింది.

ఏజెన్సీతో ఒప్పందం కూడా చేసుకున్నది. అయితే, వివిధ సమస్యలతో ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఈ ఏడాది డిసెంబర్​ వరకు పనులు పూర్తి చేయాలని డెడ్​లైన్ గా పెట్టారు. పనులు లేట్ అవుతుండడంతోప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంక్​ గ్యారంటీని మినహాయించుకుని మిగిలిన డబ్బును చెల్లించేందుకు హెచ్ పీసీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.