సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ కవిత పై గ్రామస్తులు దాడికి యత్నించారు. గుడిబండ గ్రామంలో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుందని ఆరోపించారు. పట్టా పేపర్లతో తమ స్థలాలు తమకు అప్పజెప్పాలని కవిత ఇంటిముందు టెంట్ వేసి కూర్చున్నారు.
కొందరు అభ్యంతరం తెలపడంతో ఘర్షణకు దారి తీసింది. మహిళలు జుట్లు పట్టుకొని తన్నుకున్నారు. ఘర్షణ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు.