200 కి.మీ.నుంచి కనిపిస్తున్న హిమాలయాలు

200 కి.మీ.నుంచి కనిపిస్తున్న హిమాలయాలు
  • షహరాన్‌పూర్‌‌లో 30 ఏళ్ల తర్వాత తగ్గని పొల్యూషన్‌
  • సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌

షహరాన్‌పూర్‌‌: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల మనుషుల పరిస్థితి ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం పులకించి పోతోంది. చాలా ప్రదేశాల్లో పొల్యూషన్‌ బాగా తగ్గిపోయింది. గంగా నది కూడా సాఫ్‌ అయింది. మీరట్‌లో డాల్ఫిన్స్‌ కూడా కనిపించాయి. అయితే ఇప్పుడు ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌‌ నుంచి హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి. 200 కిలో మీటర్ల దూరం ఉన్న గంగోత్రి, బంద్రాపంచ్‌ పర్వాతాలు 30 ఏళ్ల కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. “ మా జనరేషనంతా హిమాలయాలు కనిపించేవి కనిపించేవీ అని స్టోరీలు వింటూ బతికింది. కానీ ఇప్పుడు నిజంగా కనిపిస్తుంటే చాలా థ్రిల్లింగా ఉంది” అని షహరాన్‌పూర్‌‌కు చెందిన వ్యక్తి ఒకరు చెప్పారు. “ పొద్దునే లేచి టెర్రస్‌ పైకి వెళ్తే ఇన్నర్‌‌ హిమాలయాల్లోని గంగోత్రీ, బంద్రాపంచ్‌ పర్వతాలు కనిపించాయి. ఇలాంటి అద్భుతం మళ్లీ ఎప్పటికి కలుగుతుందో అని వెంటనే ఫొటోలు క్లిక్‌ మనిపించాను” అని ఇంకమ్‌ ట్యాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌‌ దుశ్యంత్‌ కుమార్‌‌ చెప్పారు. ఆ ఫొటోలను ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేయగా.. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. షహరాన్‌పూర్‌‌ నుంచి గంగోత్రీ పర్వాతల మధ్య దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పొల్యూషన్‌ తగ్గిపోయి గాలి కూడా స్వచ్ఛంగా తయారైందని అధికారులు చెప్పారు.