హిమాయత్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన సీపీఐ నేత నారాయణ

హిమాయత్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన  సీపీఐ నేత నారాయణ
  • రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ నారాయణ సూచన

హైదరాబాద్ : రాజేంద్రనగర్ దగ్గర ఉన్న హిమాయత్ సాగర్ ప్రాజెక్టును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. అక్కడి ప్రకృతిలోని ఆహ్లాదకర వాతావరణం చూసి పరవశించిపోయారు. తనలా ప్రకృతి ఒడిలో గడిపేందుకు వచ్చిన సందర్శకులను చూసి నారాయణ స్పందించారు. 

దైనందిన జీవితంలో అటవిడుపుగా తనలా చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రజలు కుటుంబ సమేతంగా హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు వస్తున్నట్లు గుర్తించానని నారాయణ చెప్పారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దితే ఇంకా బాగుంటుందని చెప్పారు.  

కనీసం రూ.100 కోట్లు కేటాయించి పర్యాటకులకు వసతి గదులు వంటి సౌకర్యాలను కల్పించి పర్యాటక శాఖకు అప్పగించాలని కోరారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు వద్ద నుంచే ఒక వీడియో తీసి.. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి రాష్ట్ర  ప్రభుత్వానికి సూచనలిచ్చారు.