అయోధ్య రామాలయంలో భారీ గంట

అయోధ్య రామాలయంలో భారీ గంట

అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయంలో 2.1 టన్నుల బరువుండే భారీ గంటను తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో ఈ గంటను దావూ దయాల్ అనే హిందూ ఫ్యామిలీ రెడీ చేస్తోంది. ఈ గంటను నైపుణ్యవంతులైన ముస్లిం కార్మికులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

బంగారం, వెండి, రాగి, సీసం, పాదరసం, ఇనుము తదితర అష్టధాతువులతో దీన్ని తయారు చేస్తున్నామని…ఈ గంటలో ఎటువంటి అతుకులు ఉండవని, ఇదే దీని ప్రత్యేకతని దయాల్ తెలిపారు. గతంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి టన్ను బరువైన గంటను తయారు చేశామన్నారు.  ఆ అనుభవంతోనే ఇప్పుడు దీని తయారీకి సిద్ధమయ్యామన్నారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షలు ఖర్చవుతుందని, 25 మంది నిపుణులు నాలుగు నెలల పాటు శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు.