న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్లో హిందుజా గ్రూప్ రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ డీల్పూర్తవుతుందని జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో ఇండస్బ్యాంక్ షేర్లు శుక్రవారం మూడు శాతం లాభపడ్డాయి. ఈ పెట్టుబడి వల్ల బ్యాంకులో హిందుజా గ్రూప్ వాటా మరింత పెరిగి 26 శాతానికి చేరుకుంటుంది. వాటా పెంపునకు ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత ఏడాదిలో బ్యాంకు షేర్లు 67 శాతం రాబడిని ఇచ్చాయి.
అంతేగాక పోయిన నెల ఈ బ్యాంక్ మార్కెట్క్యాప్ రూ.లక్ష కోట్లకు చేరుకుంది. 2020 జనవరిలో మొదటిసారిగా రూ.లక్ష కోట్ల మార్కెట్క్యాప్ను టచ్చేసింది. అయితే కరోనా టైమ్లో షేర్ల విలువ బాగా తగ్గింది. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్షేర్ 52 వారాల గరిష్టం రూ.1,342 లను ఈ నెల 13న టచ్ చేసింది. 52 వారాల కనిష్టం రూ.763.