ఏపీ అసెంబ్లీలో వైసీపీకి బాలయ్య మాస్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి బాలయ్య మాస్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీలో బాలయ్య అసభ్య పదం వచ్చేలా సైగలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని చర్చించేందుకు టీడీపీ సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సభ నుంచి బయటకు వస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతల వైపు చేతిని చూపిస్తూ  అసభ్యకరంగా సైగ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

టీడీపీ అభిమానులు మాత్రం బాలయ్య సైగలతో ఖుషీ అవుతున్నారు. బాలయ్య బాబు నుంచి ఇలాంటి మాస్ వార్నింగ్.. మాస్ పాలిటిక్స్ కోసం ఇన్నాళ్లు వెయిటింగ్ అంటున్నారు. వైసీపీ నేతలకు ఇచ్చిన బాలయ్య మాస్ వార్నింగ్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.