కరోనా కొత్త వేవ్ వచ్చినా.. కొత్త జాబ్స్ వస్తాయి

కరోనా కొత్త వేవ్ వచ్చినా.. కొత్త జాబ్స్ వస్తాయి

ముంబై: కరోనా వైరస్​ కొత్త వేరియంట్​ వచ్చినా కొత్త కొలువులపై దాని ఎఫెక్ట్​ ఉండదని  ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది. అన్ని రంగాలలోని సీనియర్​ లెవెల్​ ఎగ్జిక్యూటివ్స్​తోపాటు, ఉద్యోగులపైనా ఈ సర్వే నిర్వహించినట్లు జీనియస్​ కన్సల్టెంట్స్​ తెలిపింది. సీనియర్​ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్​లో ఎక్కువమంది, ఉద్యోగులలో 73 శాతం మంది కొత్త వేరియంట్​ ఎఫెక్ట్​ ఉండదనే అభిప్రాయం తెలిపినట్లు ఈ సర్వే రిపోర్టులో పేర్కొంది. సర్వేలో 1,468 మంది సీనియర్​ లెవెల్​ ఎగ్జిక్యూటివ్స్​, ఉద్యోగులు పాల్గొన్నట్లు వివరించింది. బ్యాంకింగ్​అండ్​ ఫైనాన్స్​, ఇంజినీరింగ్​, ఎడ్యుకేషన్​, ఎఫ్​ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్​ఆర్​ సొల్యూషన్స్​, ఐటీ, ఐటీఈఎస్​, బీపీఓ, లాజిస్టిక్స్​, మాన్యుఫాక్చరింగ్​, మీడియా, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఫార్మా రంగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్​, ఉద్యోగులు సర్వేలో భాగం పంచుకున్నట్లు జీనియస్​ కన్సల్టెంట్స్​ పేర్కొంది. కొత్త వేరియంట్​ వచ్చినా తమ ఉద్యోగాలకు ముప్పు రాదని 69 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పడం మరో విశేషమని తెలిపింది. కొత్త వేరియంట్​ వచ్చినా ఒమిక్రాన్​లాగే ఉండొచ్చని, హాస్పిటళ్లకు పరిగెత్తేలా ఉండకపోవచ్చని 71%  మంది ఈ సర్వేలో వెల్లడించారు. హైబ్రిడ్​ వర్క్​ మోడల్స్​నే చాలా కంపెనీలు ఎంకరేజ్​ చేస్తాయన్నారు.