న్యూఢిల్లీ: అయోధ్యలోని ప్రసిద్ధ రామాలయ నిర్మాణ పనులు బుధవారం మొదలవనున్నాయి. భూమి పూజతో ప్రారంభమయ్యే నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ విజిట్లో భాగంగా రామ మందిరానికి వచ్చే ముందు మోడీ మరో ఆలయాన్ని దర్శింకోనున్నారని తెలుస్తోంది. 10వ శతాబ్దంలో నిర్మించిన హనుమాన్గఢీ అనే దేవాలయాన్ని మోడీ దర్శింకుంటారని ఆ ఆలయ పూజారి తెలిపారు.
Ayodhya: Hanuman Garhi temple being sanitised ahead of PM Modi's visit on August 5. Temple priest says, "PM Modi will first visit Hanuman Garhi temple and offer his prayers before going for bhoomi pujan at Ram Janambhoomi, so preparations are underway for his visit here." pic.twitter.com/cyuXvlamsZ
— ANI UP (@ANINewsUP) August 3, 2020
అయోధ్యలోనే హనుమంతుడు కొలువై ఉన్న హనుమాన్గఢీని ప్రధాని మోడీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకుంటారని, ఆ తర్వాతే రామ జన్మభూమికి వెళ్లి భూమి పూజ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని సమాచారం. ‘హనుమంతుడు లేకుండా రాముడి ఏ పనీ ప్రారంభమవ్వదు. ఇందుకే మోడీ జీ, యోగీ జీ ఈ హనుమాన్ టెంపుల్కు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాతే హనుమంతుడి దీవెనలతో రామాలయ జన్మభూమికి వెళ్లి భూమి పూజ మొదలుపెడతారు’ అని హనుమాన్గఢీ ఆలయ పూజారి మధువన్ దాస్ చెప్పారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు చేయడంలో భాగంగా మోడీ ఏడు నిమిషాల పాటు ఉండనున్నారని పేర్కొన్నారు.