బిట్​ బ్యాంక్​ : తెలంగాణ మహాసభ

బిట్​ బ్యాంక్​ : తెలంగాణ మహాసభ
  •     - ఆంధ్రప్రదేశ్​ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం 1968–69 మధ్యకాలంలో ఉద్యమం జరిగింది. 
  •     - నీలం సంజీవరెడ్డి తర్వాత దామోదరం సంజీవయ్య ఏపీ సీఎం అయ్యారు. 
  •     - దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్న కాలంలో కొండా వెంకట రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. 
  •     - కొండా వెంకట రంగారెడ్డి 1959 నుంచి 1962 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 
  •     - 1962 తర్వాత 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవిని పక్కనపెట్టారు. 
  •     - 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉప ముఖ్యమంత్రిగా సమైక్యతావాది అయిన కరీంనగర్​కు చెందిన జేవీ నరసింగరావును నియమించారు. 
  •     - బూర్గుల రామకృష్ణారావు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా వివక్ష చూపారు. 
  •     - భారత్​, పాకిస్తాన్​ యుద్ధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో 10శాతం కోత విధించి పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడంతో తెలంగాణలో చాలా మంది ఇంజినీర్లు 1965–66 మధ్యకాలంలో నిరుద్యోగులయ్యారు. 
  •     - తెలంగాణలో ఉన్న పర్మినెంట్​ పోస్టులన్నీ ఆంధ్రవారు ఆక్రమించి, తాత్కాలిక సూపర్​ న్యూమరి పోస్టులను తెలంగాణ వారికి కేటాయించారు. దీంతో తాత్కాలిక ఉద్యోగులను తొలగించినప్పుడు తెలంగాణ వారు నిరుద్యోగులు కావాల్సి వచ్చింది. 
  •     - ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిన తర్వాత పదోన్నతులు, పే స్కేళ్ల విషయంలో తెలంగాణ ఇంజినీర్లు అన్యాయానికి గురయ్యారు.
  •     - 1967 నాటికి తెలంగాణలో ఆంధ్ర టీచర్ల సంఖ్య 4000కు చేరుతుంది. 
  •     - ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను తొక్కివేయడంతోపాటు ప్రజా ఉద్యోగ చట్టం –1957ను కూడా ఉల్లంఘించారు. 
  •     - రెండు ప్రాంతాల సివిల్​ సర్వీస్​ అధికారుల సీనియారిటీలను కలిపేసి, కామన్​ సీనియారిటీ జాబితాను రూపొందించి, ఆంధ్రా ప్రాంతపు నియమ నిబంధనలను అమలు చేయడంతో ప్రమోషన్లలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. 
  •     - 1950 హైదరాబాద్​ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని ఐదో అధ్యాయం 47 నుంచి 50 సెక్షన్ల ప్రకారం తెలంగాణ వ్యవసాయ భూములను తెలంగాణేతరులు కొనడం చట్ట విరుద్ధం. 
  •     - 1950 హైదరాబాద్​ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టాన్ని ఉల్లంఘించి, 1956కు ముందు ఆంధ్రవారు నిజామాబాద్​, వరంగల్​  జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారు. 
  •     - పెద్ద మనుషుల ఒప్పందంలోని 8వ అంశం ప్రకారం తెలంగాణలోని వ్యవసాయ భూములను అమ్మడం, కొనడం తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారానికి లోబడి ఉండాలి. 
  •     - తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండా ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు నిజామాబాద్​, వరంగల్​, ఖమ్మం, ఆదిలాబాద్​ జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూమిని కౌరుచౌకగా కొనుగోలు చేశారు. 
  •     - 1950 హైదరాబాద్​ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని 47 నుంచి 50 వరకు గల సెక్షన్లను 1968లో పూర్తిగా రద్దు చేశారు.
  •     - వరంగల్​, ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో 60 నుంచి 80శాతం మాగాణి భూమి స్థానిక రైతుల నుంచి ఆంధ్రా వలసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 
  •     - నిజాంసాగర్​ కింద సారవంతమైన భూమిలో 40శాతం వలసవాదుల చేతుల్లోకి వెళ్లింది. 
  •     - ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 17 నెలలకు నాటి పాలకులు జరిపిన అన్యాయాలను వేలెత్తి చూపే సాహసం చేసిన సంస్థ తెలంగాణ మహాసభ. 
  •     - తెలంగాణ మహాసభ ఆనాటికి పాలకులు చేస్తున్న అన్యాయాలపై కేంద్ర విదేశాంగ మంత్రి గోవింద వల్లభ్​ పంత్​కు విజ్ఞాపన పత్రాన్ని పంపింది. 
  •     - పరిస్థితి చేయి జారక ముందే మేల్కొనండి అంటూ 1959 డిసెంబర్​ 12న ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసిద్ధ న్యాయవేత్త గులాం పంజాతన్​ బహిరంగ లేఖ రాశారు. 
  •     - తెలంగాణ ప్రజలకు ఉద్యోగాల్లో జరిగిన
  •  అన్యాయాలను విచారించి, వాటిని అరికట్టేందుకు ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని 1960లో ప్రధాన జవహర్​లాల్​ నెహ్రూకు తెలంగాణ మహాసభ విజ్ఞాపన పత్రం పంపింది. 
  •     - కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని వెంటనే అన్ని విషయాలు సర్దుబాటు చేయకపోతే మున్ముందు ఒక మహా ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని 1960లో రాజ్యసభలో వి.కె.థగే హెచ్చరిక చేశారు. 
  •     - పెద్ద మనుషుల ఒప్పందం మౌలిక ఉద్దేశాలనే పాలకులు విస్మరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఏమాత్రం సంతోషంగా లేరు, ప్రజల ఫిర్యాదులకు అంతూ పంతూ లేదని 1960లో పార్లమెంట్​లో ఎంపీ హరిశ్చంద్ర హెడా ఆవేదన వ్యక్తం చేశారు.