ఏడేండ్ల బాలికపై హెచ్​ఎం అత్యాచారం.. నిందితుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

ఏడేండ్ల బాలికపై హెచ్​ఎం అత్యాచారం.. నిందితుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సెకండ్ క్లాస్ బాలికపై స్కూలు  హెడ్​మాస్టర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల కింద జరిగిన ఈ దారుణంపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రెలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. చింతవర్రె ప్రైమరీ స్కూల్​లో హెచ్​ఎం సునీల్​ తో పాటు మరో టీచర్​ పని చేస్తున్నారు. వీరిద్దరు చేరో వారం గ్రామానికి వచ్చి పాఠాలు చెప్తున్నారు. మొత్తం 12 మంది స్టూడెంట్లుంటే ఆరుగురు ఆడపిల్లలు ఈ స్కూలులో చదువుకుంటున్నారు. సెకండ్ క్లాస్​ అమ్మాయి వారం కింద అనారోగ్యానికి గురికాగా డాక్టర్​కు చూపించడంతో అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో గ్రామస్తులు హెచ్​ఎం సునీల్​ ను పట్టుకుని 4  రోజుల కింద దేహశుద్ది చేశారు. సునీల్​ అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు మంగళవారం కంప్లైంట్ చేయడంతో తహశీల్దార్​తో పాటు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బాలికను మెడికల్​ టెస్టులకు పంపుతామని చెప్పారు. బాలికపట్ల అసభ్యంగా వ్యవహరించిన హెచ్​ఎం సునీల్​ను సస్పెండ్​ చేస్తున్నట్టు డీఈఓ సోమశేఖర శర్మ పేర్కొన్నారు.