గద్దర్​ విగ్రహం ఏర్పాటుకు హెచ్ఎండీఏ జాగ  కేటాయిస్తూ ఉత్తర్వులు

గద్దర్​ విగ్రహం ఏర్పాటుకు హెచ్ఎండీఏ జాగ  కేటాయిస్తూ ఉత్తర్వులు

 హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్​ విగ్రహం ఏర్పాటుకు భూమిని కేటాయిస్తూ హెచ్​ఎండీఏ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్​లో సర్వే నంబర్​323/14లోని 1076.4  చదరపు గజాల స్థలాన్ని కేటాయించినట్టు అధికారులు  మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. కొంత కాలంగా గద్దర్​ విగ్రహం ఏర్పాటుకు భూమి కేటాయించాలంటూ పలువురు డిమాండ్​చేశారు. దీంతోపాటు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని హెచ్‌‌‌‌ఎండీఏ ఆమోదించింది.