అమెరికా ఆంక్షలు ఎఫెక్ట్.. రష్యా చమురు కొనుగోలు నిలిపివేత

అమెరికా ఆంక్షలు ఎఫెక్ట్.. రష్యా చమురు కొనుగోలు నిలిపివేత
  • ప్రకటించిన హెచ్​పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ 

న్యూఢిల్లీ: ఆంక్షల కారణంగా రష్యా ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తున్నట్లు ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్, హెచ్​పీ కలిసి ఏర్పాటు చేసిన జేవీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈఎల్ బుధవారం ప్రకటించింది. రష్యా ముడి చమురుపై అమెరికా, యూరప్​, యూకే, కొత్త ఆంక్షలు విధించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. 

మిట్టల్ గ్రూప్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్) కలిసి ఏర్పాటు చేసిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈఎల్, రష్యా చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు విధించాక రష్యా ముడి చమురును కొనబోమని అధికారికంగా ప్రకటించిన మొదటి భారతీయ సంస్థ. ఇది పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భటిండాలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది.