హాకీకి లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ్ గుడ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై..

హాకీకి లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ్ గుడ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై..

న్యూఢిల్లీ: ఇండియా హాకీ వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయ్​.. హాకీ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం బెల్జియంతో జరిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత తన నిర్ణయాన్ని సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ప్రకటించాడు. 2014 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరంగేట్రం నుంచి టోక్యో (2020),  పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2024) ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకాలు గెలిచిన ఇండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పదేళ్ల కాలంలో ఇండియా జట్టులో బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘పరిమిత వనరులు, అపరిమితమైన కలలతో కూడిన ఓ చిన్న గ్రామం నుంచి నా ప్రయాణం మొదలైంది.

స్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోడియం వరకు వెళ్లాను. సవాళ్లు, అభివృద్ధి, మరపురాని గర్వంతో నిండిన మార్గం ఇది. 26 ఏళ్ల తర్వాత నా నగరం నుంచి నేను ఒలింపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారా. దీన్ని నేను ఎల్లప్పుడూ గౌరవంగా భావిస్తా’ అని లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ఇండియా తరఫున 183 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 67 గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 2016 ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ, 2017 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2017 హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో కాంస్యం, 2018 చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో రజతం, 2018 ఆసియా క్రీడల్లో కాంస్య, 2018 ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో స్వర్ణం నెగ్గాడు. 2022 ఆసియా క్రీడల్లో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.