
కటక్: ఇండియాలో మరో మెగా ఈవెంట్ స్పోర్ట్ ఫ్యాన్స్కు కిక్ ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్కప్నకు కౌంట్డౌన్ షురూ అయింది. శుక్రవారం నుంచి ఈనెల 29 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 టీమ్స్ తమ బెస్ట్ ఆటతో కప్పు కోసం కసిగా పోరాడనున్నాయి. మన దేశంలో హాకీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఒడిశా మరోసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. 2018లో అద్భుతంగా టోర్నీని నిర్వహించిన ఒడిశా గవర్నమెంట్ ఈసారి కూడా సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. అందుకు ట్రయల్లా బుధవారం రాత్రి బారాబతి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీని అట్టహాసంగా నిర్వహించింది. ఓవైపు బాలీవుడ్ స్టార్స్ రణ్వీర్ సింగ్, దిశా పటానీ స్టెప్పులు.. మరోవైపు ట్రైబల్స్ నృత్యాలు.. మధ్యలో స్థానిక కళాకారుల ఆట, పాటలు.. వీటన్నింటికి మించి వందలాది మంది ఆలపించిన టోర్నీ థీమ్ సాంగ్ ‘హాకీ హై దిల్ మేరా’తో సెర్మనీ కలర్ఫుల్గా సాగింది.
గంటపాటు జరిగిన కార్యక్రమాలతో హాకీ ఫ్యాన్స్ ఊగిపోయారు. ప్రఖ్యాత డాన్సర్ గురు అరుణ మొహంతి.. ఆరుగురు లోకల్ డ్యాన్సర్లతో రూపొందించిన డ్యాన్స్ చూపరులను మంత్రముగ్దులను చేసింది. ఒడిశా సింగర్లు స్నితి మిశ్రా, రుతురాజ్ మొహంతి, లిసా మిశ్రాతో పాటు ఇతర పెర్ఫామర్స్ తమ పాటలతో అదరహో అనిపించారు. కటక్లోని 16 ముఖ్యమైన ప్లేస్ల్లో పెద్ద జాయింట్ స్ర్కీన్స్ను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ స్వరపర్చిన థీమ్ సాంగ్తో స్టేడియంలోని 40 వేల మంది ఫ్యాన్స్ ఊగిపోయారు. బ్లాక్ డ్రెస్లో దిశా చేసిన హాట్హాట్ డాన్స్ సూపర్ అనిపించింది. ప్రీతమ్, లోకల్ సింగర్స్తో పాటు కే పాప్ బాండ్ బ్లాక్స్వాన్ చేసిన పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా చేసిన ఫైర్వర్క్తో స్టేడియం జిగేల్మంది.
‘ఒడిశా.. ల్యాండ్ ఆఫ్ హాకీ’
2018లో వరల్డ్కప్కు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. రెండోసారి మెగా టోర్నీని నిర్వహిస్తున్నది. దీంతో ఒడిశాను ‘ల్యాండ్ ఆఫ్ హాకీ’ అంటూ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తయ్యబ్ ఇక్రామ్ అభివర్ణించారు. చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్తో పాటు 16 జట్ల ప్లేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన ఆతిథ్యానికి ఒడిశా పేరుగాంచిందని, ఈ జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని సీఎం పట్నాయక్ అన్నారు. కాగా, ఈ టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూప్స్లో బరిలో నిలిచాయి. ఇండియా పూల్–డిలో వేల్స్, స్పెయిన్, ఇంగ్లండ్తో కలిసి పోటీ పడుతోంది. బిర్సా ముండా హాకీ స్టేడియం, కళింగ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి.