రేపటి నుంచి హాకీ వరల్డ్​కప్ పోటీలు

రేపటి నుంచి హాకీ వరల్డ్​కప్ పోటీలు

కటక్: ఇండియాలో మరో మెగా ఈవెంట్ స్పోర్ట్ ఫ్యాన్స్​కు కిక్​ ఇవ్వనుంది.  ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్​కప్​నకు కౌంట్​డౌన్​ షురూ అయింది. ​ శుక్రవారం నుంచి  ఈనెల 29 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 టీమ్స్​ తమ బెస్ట్ ఆట​తో కప్పు కోసం కసిగా పోరాడనున్నాయి. మన దేశంలో హాకీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న  ఒడిశా మరోసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. 2018లో అద్భుతంగా టోర్నీని నిర్వహించిన ఒడిశా గవర్నమెంట్​ ఈసారి కూడా సక్సెస్​ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. అందుకు ట్రయల్​లా బుధవారం రాత్రి  బారాబతి స్టేడియంలో ఓపెనింగ్​ సెర్మనీని అట్టహాసంగా నిర్వహించింది. ఓవైపు బాలీవుడ్​ స్టార్స్​ రణ్​వీర్​ సింగ్​, దిశా పటానీ స్టెప్పులు.. మరోవైపు ట్రైబల్స్​ నృత్యాలు.. మధ్యలో స్థానిక కళాకారుల ఆట, పాటలు.. వీటన్నింటికి మించి వందలాది మంది ఆలపించిన టోర్నీ థీమ్​ సాంగ్​ ‘హాకీ హై దిల్​ మేరా’తో  సెర్మనీ కలర్​ఫుల్​గా సాగింది.  

గంటపాటు జరిగిన   కార్యక్రమాలతో హాకీ ఫ్యాన్స్ ఊగిపోయారు. ప్రఖ్యాత డాన్సర్​ గురు అరుణ మొహంతి.. ఆరుగురు లోకల్​  డ్యాన్సర్లతో రూపొందించిన డ్యాన్స్​ చూపరులను మంత్రముగ్దులను చేసింది. ఒడిశా సింగర్లు స్నితి మిశ్రా, రుతురాజ్​ మొహంతి, లిసా మిశ్రాతో పాటు ఇతర పెర్ఫామర్స్​ తమ పాటలతో అదరహో అనిపించారు. కటక్​లోని 16 ముఖ్యమైన ప్లేస్​ల్లో పెద్ద జాయింట్​ స్ర్కీన్స్​ను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని లైవ్​ స్ట్రీమింగ్​​ చేశారు. మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రీతమ్​ స్వరపర్చిన థీమ్​ సాంగ్​తో స్టేడియంలోని 40 వేల మంది ఫ్యాన్స్​ ఊగిపోయారు. బ్లాక్​ డ్రెస్​లో దిశా చేసిన హాట్​హాట్​ డాన్స్ సూపర్​ అనిపించింది. ప్రీతమ్,  లోకల్​ సింగర్స్​తో పాటు కే పాప్​ బాండ్​ బ్లాక్​స్వాన్​ చేసిన పెర్ఫామెన్స్​ కూడా ఆకట్టుకుంది.  ఓపెనింగ్​ సెర్మనీ సందర్భంగా చేసిన ఫైర్​వర్క్​తో స్టేడియం జిగేల్​మంది. 

‘ఒడిశా.. ల్యాండ్​ ఆఫ్​ హాకీ’

2018లో వరల్డ్​కప్​కు ఆతిథ్యమిచ్చిన ఒడిశా.. రెండోసారి మెగా టోర్నీని నిర్వహిస్తున్నది. దీంతో ఒడిశాను ‘ల్యాండ్​ ఆఫ్​ హాకీ’ అంటూ ఇంటర్నేషనల్​ హాకీ ఫెడరేషన్​ ప్రెసిడెంట్​ తయ్యబ్​ ఇక్రామ్​ అభివర్ణించారు. చీఫ్​ మినిస్టర్​ నవీన్​ పట్నాయక్​, సెంట్రల్​ స్పోర్ట్స్​ మినిస్టర్​ అనురాగ్​ ఠాకూర్​తో పాటు 16 జట్ల ప్లేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన ఆతిథ్యానికి ఒడిశా పేరుగాంచిందని, ఈ జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని సీఎం పట్నాయక్​ అన్నారు.  కాగా, ఈ టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూప్స్​లో బరిలో నిలిచాయి. ఇండియా పూల్–డిలో  వేల్స్​, స్పెయిన్, ఇంగ్లండ్​తో కలిసి పోటీ పడుతోంది. బిర్సా ముండా హాకీ స్టేడియం,  కళింగ స్టేడియంలో మ్యాచ్​లు జరుగుతాయి.