కామారెడ్డిలో రెండో రోజు కొనసాగిన హోం ఓటింగ్

కామారెడ్డిలో రెండో రోజు కొనసాగిన హోం ఓటింగ్

కామారెడ్డిటౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో రెండో రోజు ఆదివారం హోం ఓటింగ్​ కొనసాగింది.   కామారెడ్డి, ఎల్లారెడ్డి,  జుక్కల్​ నియోజక వర్గాల్లో హోం ఓటింగ్​ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఎన్నికల విధులు నిర్వహించే  ఆఫీసర్లు, స్టాప్​ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటువేశారు.  కామారెడ్డి ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన సెంటర్​లో  వారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్​ ఓట్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ తెలిపారు.