జూబ్లీహిల్స్, వెలుగు: ఇంటి ముందు వేసిన ముగ్గు, మొక్కలు తొక్కిందని కిరాయికి ఉంటున్న ఇద్దరు మహిళలు ఓనర్పై దాడికి దిగారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్పరిధిలోని రహమత్నగర్లో దివ్యభారతి (33) నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో సంధ్య అనే మహిళ అద్దెకు ఉంటోంది. ఇటీవల సంధ్య తన ఇంటి గడప ముందు ముగ్గు వేసింది.
దీనిని ఇంటి యజమాని తొక్కిందని సంధ్య ఆమె తల్లి అసభ్యపదజాలంలో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఆవేశంతో తల్లీకూతుళ్లు దివ్యభారతిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
