హైదరాబాద్, వెలుగు: చందానగర్(హైదరాబాద్), కరీంనగర్లో 5 ప్లాట్ల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ. 54.36 కోట్ల ఆదాయం వచ్చింది. చందానగర్లో 2,593 గజాలు, 1,809 గజాలు, 2,716 గజాల ప్లాట్లకు ఆన్లైన్ ద్వారా అధికారులు వేలం నిర్వహిం చారు.
వీటికి గజం రూ.40 వేలుగా అప్సెట్ అమౌంట్ను ఖరారు చేయగా.. వేలంలో 2 ప్లాట్లు గజం రూ.45 వేల చొప్పున, మరో ప్లాట్ రూ.40 వేల చొప్పున అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
మూడు ప్లాట్ల వేలంతో రూ. 31.13 కోట్లు ఆదాయం వచ్చినట్టు చెప్పారు. ఇక కరీంనగర్లో 4,235 గజాలు, 3,025 గజాల ప్లాట్లకు ఆన్లైన్లో వేలం నిర్వహించారు. గజం రూ.30వేలు అధికారులు ఖరారు చేయగా.. రూ. 32వేలకు ఐసీఏఐ కంపెనీ, మరో ప్లాటును ప్రైవేట్ వ్యక్తి గజం రూ. 32 వేలకు కొనుగోలు చేశారని ఎండీ తెలిపారు.
