ముంబై: హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను కలవడానికి వెళ్తున్న ప్రియాంక గాంధీ వాద్రాను ఓ మగ పోలీసు నిలువరించిన తీరుపై దుమారం రేగుతోంది. ప్రియాంక దుస్తులపై సదరు పోలీసు చేయి వేసి అడ్డుకోవడంపై మహారాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్రా వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చిత్ర కోరారు. ‘ఎంత ధైర్యం ఉంటే ఓ మగ పోలీసు ఒక మహిళా రాజకీయ నేత బట్టలపై చేయి వేయగలడు? పోలీసులు వారి హద్దుల్లో ఉండాలి. భారత సంస్కృతిపై నమ్మకం కలిగిన యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి ఘటనకు కారణమైన పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చిత్ర ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై స్పందించిన యూపీ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
पुरुष पुलिस की जुर्रत कैसे हुई कि वो एक महिला नेता के वस्त्रों पर हाथ डाल सके!समर्थन मे अगर महीलाए आगे आ रही है पुलीस कही की भी हो उन्हे अपनी मर्यादा का ध्यान रखना ही चाहीए
भारतीय संस्कृती मे विश्वास रखनेवाले मुख्यमंत्री @myogiadityanath जी ऐसे पुलीसवालोपर सख्त कारवाई करे @dgpup pic.twitter.com/RfbXiIIXcI— Chitra Kishor Wagh (@ChitraKWagh) October 4, 2020