తెలుగు, తమిళ అలనాటి నటి రాధ కుమార్తె, రంగం ఫేమ్ కార్తీక నాయర్(Karthika Nair) పెళ్లి (నవంబర్ 19న) ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కార్తీక నాయర్-రోహిత్ మీనన్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కార్తీక నాయర్-రోహిత్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..రాధా తన కూతురికి ఇచ్చిన కట్నం వివరాలపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. రాధా తన కూతురు పెళ్లికి కట్నంగా రూ.8 కోట్లు విలువ చేసే ఒక ఖరీదైన కారుతో పాటు..30 కోట్ల విలువ చేసే బంగారం కట్నంగా ఇచ్చినట్టు సమాచారం.
అంతేకాకుండా..ప్రస్తుతం కార్తీక నాయర్ దుబాయ్ లో చూసుకునే రెస్టారెంట్ ని కూడా..కూతురు పేరు మీద..అల్లుడికి కట్నంగా రాసిచ్చిందట. ఎంతో అనురాగంగా పెంచిన తన కూతురికి ఇవన్నీ ఇవ్వడంతో..నెటిజన్స్ అభినందిస్తున్నారు.
ఈ పెళ్ళికి కుటుంసభ్యులతో పాటు చిరంజీవి- సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై..నూతన వధూవరులను ఆశీర్వదించారు.