
రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలిగిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను 2023 మే 23 నుంచి మార్చుకునే అవకాశాన్ని కలిపించింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా పది రూ.2 వేల నోట్లను అంటే 20 వేల రూపాయలను డిపాజిట్ చేసుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇప్పుడు దేశంలో 2 వేల నోట్లు ఎన్నున్నాయన్నది పెద్ద చర్చగా మారింది. రూ. 3.62 లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది.
వేల నోటును ఎలా మార్చుకోవాలంటే..
- ప్రజలు తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు.
- దీనికి తగిన డబ్బును 500, 100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు.
- బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను మీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు.
- రోజుకు 20 వేల రూపాయలను మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే 10 నోట్లను మాత్రమే.
- పది 2 వేల నోట్లను మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే అవకాశం
- ఒక వేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.