- ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: భారత పౌరసత్వం రద్దయినా చెన్నమనేని రమేశ్కు పెన్షన్ ఎలా ఇస్తారని అసెంబ్లీ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేశారు. కేంద్ర హోం శాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
జర్మనీలో ఉంటున్న చెన్నమనేనికి ఇప్పటికీ అసెంబ్లీ నుంచి పెన్షన్ ఆయన బ్యాంకు అకౌంట్లో పడుతోందన్నారు. దీనిపై అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పెన్షన్ ఆగలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా.. చెన్నమనేని పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే.
మోసపురితంగా భారత పౌరసత్వం పొందారంటూ హోం శాఖకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చెన్నమనేని భారత పౌరసత్వంపై శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సిటిజన్ షిప్ యాక్ట్ 1995లోని సెక్షన్ 10 కింద పౌరసత్వాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
