ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. వనస్థలిపురంలోని సచివాలయా నగర్లో ఉండే సంజన ప్రియ(36) చైతన్యపురిలో ఓ కన్సల్టెన్సీలో హెచ్ఆర్. 2011లో ఎలుక సంపత్కుమార్తో పెండ్లి కాగా, 12 ఏండ్ల కొడుకు ఉన్నాడు. శనివారం ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.
మంగల్పల్లి సమీపంలోని కసిరెడ్డి సాయినాథ్రెడ్డి రూంలో రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుంది. తర్వాత సంజన ఫోన్నుంచి ఆమె కుటుంబసభ్యులకు కాల్వచ్చింది. సంజన మన్నెగూడలోని మహోనియా దవాఖానలో అపస్మారక స్థితిలో ఉందని, సాయినాథ్రెడ్డి అనే వ్యక్తి తీసుకువచ్చి జాయిన్ చేసి వెళ్లాడని చెప్పారు. దీంతో సంజన భర్త సంపత్అక్కడికి వెళ్లగా చనిపోయిందని చెప్పారు. తన భార్య మృతికి సాయినాథ్రెడ్డే కారణమని ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవితేజ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
