క్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌

క్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌

కౌలాలంపూర్‌‌‌‌: ఇండియా షట్లర్లు హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్, సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి మలేసియా ఓపెన్​లో క్వార్టర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరుకున్నారు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్​ ప్రిక్వార్టర్స్​లో ప్రణయ్​ 21–9, 15–21, 21–16తో ఇండోనేసియా షట్లర్‌‌‌‌ చికో ఆరా ద్విపై విజయం సాధించాడు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ జోడీ 21–19, 22–20తో షోహిబుల్‌‌‌‌ ఫిక్రి–బగాస్‌‌‌‌ (ఇండోనేసియా)ను ఓడించింది. విమెన్స్‌‌‌‌ డబుల్స్​లో పుల్లెల గాయత్రి–ట్రీసా 13–21, 21–15, 17–21తో బల్గేరియా జంట గాబ్రియెల్లా–స్టెఫానీ చేతిలో పోరాడి ఓడింది.