
కౌలాలంపూర్: ఇండియా షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి మలేసియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21–9, 15–21, 21–16తో ఇండోనేసియా షట్లర్ చికో ఆరా ద్విపై విజయం సాధించాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–19, 22–20తో షోహిబుల్ ఫిక్రి–బగాస్ (ఇండోనేసియా)ను ఓడించింది. విమెన్స్ డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రీసా 13–21, 21–15, 17–21తో బల్గేరియా జంట గాబ్రియెల్లా–స్టెఫానీ చేతిలో పోరాడి ఓడింది.