ములుగు జిల్లా: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ములుగు జిల్లా: బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం కొత్త అందాలు సంతరించుకుంది. ఇటీవల ఎగువున కురిసిన భారీ వర్షాలకు జలపాతానికి భారీగా నీరు చేరుకోవడంతో.. జలపాతం అందాలను తిలకించడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు జలపాత ప్రాంగణంలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. అందునా నేడు(ఆదివారం) సెలవు రోజు కావడంతో జలపాతం ప్రాంగణం అంతా కూడా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. పర్యాటకులు.. జలపాతం అందాలను సెల్ ఫోన్ లలో కాలాన్నే మైమరిచిపోయారు.