21వ వార్షికోత్సవం సందర్భంగా బిగ్​సీలో మస్తు ఆఫర్లు

21వ వార్షికోత్సవం సందర్భంగా బిగ్​సీలో మస్తు ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రానిక్స్​ రిటైల్​ బిగ్​ సీ తన 21వ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. తన షోరూముల్లో స్మార్ట్​ఫోన్ కొంటే రూ.1.10 లక్షల విలువైన హెల్త్​కేర్​ సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయని సంస్థ ఫౌండర్​ బాలు చౌదరి చెప్పారు. వీటిలో అపరిమిత టెలిఫోనిక్​ డాక్టర్ కన్సల్టేషన్​, యాక్సిడెంటల్​ బీమా, మందులపై డిస్కౌంట్​వంటివి ఉంటాయి. అంతేగాక స్మార్ట్​ఫోన్​ కొంటే రూ.75 వేల విలువైన పేటీఎం బెనిఫిట్స్​కూడా వస్తాయి.

ఈ కూపన్లతో ఎంటర్​టైన్​మెంట్​, డైనింగ్​, ట్రావెలింగ్​, వెల్​నెస్​, షాపింగ్​కు సంబంధించిన లాభాలు పొందవచ్చు. స్మార్ట్​ఫోన్​ కొంటే  21 రూపాయలకే రూ.ఐదు వేల విలువైన ఫైర్​బోల్ట్​ స్మార్ట్​వాచ్​ లేదా రూ.మూడు వేల విలువైన రెడ్​మీ బడ్స్​ ఇస్తున్నారు. ప్రతి మొబైల్​, స్మార్ట్​టీవీ, లాప్​టాప్​ కొనుగోలుపై కచ్చితంగా బహుమతి పొందవచ్చు. పది శాతం వరకు క్యాష్​బ్యాక్​ ఉంటుంది. ఏటీఎం కార్డుతో డౌన్​పేమెంట్ లేకుండా ఎలక్ట్రానిక్​ వస్తువులు కొనొచ్చు.