హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్స్ రిటైల్ బిగ్ సీ తన 21వ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. తన షోరూముల్లో స్మార్ట్ఫోన్ కొంటే రూ.1.10 లక్షల విలువైన హెల్త్కేర్ సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయని సంస్థ ఫౌండర్ బాలు చౌదరి చెప్పారు. వీటిలో అపరిమిత టెలిఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్, యాక్సిడెంటల్ బీమా, మందులపై డిస్కౌంట్వంటివి ఉంటాయి. అంతేగాక స్మార్ట్ఫోన్ కొంటే రూ.75 వేల విలువైన పేటీఎం బెనిఫిట్స్కూడా వస్తాయి.
ఈ కూపన్లతో ఎంటర్టైన్మెంట్, డైనింగ్, ట్రావెలింగ్, వెల్నెస్, షాపింగ్కు సంబంధించిన లాభాలు పొందవచ్చు. స్మార్ట్ఫోన్ కొంటే 21 రూపాయలకే రూ.ఐదు వేల విలువైన ఫైర్బోల్ట్ స్మార్ట్వాచ్ లేదా రూ.మూడు వేల విలువైన రెడ్మీ బడ్స్ ఇస్తున్నారు. ప్రతి మొబైల్, స్మార్ట్టీవీ, లాప్టాప్ కొనుగోలుపై కచ్చితంగా బహుమతి పొందవచ్చు. పది శాతం వరకు క్యాష్బ్యాక్ ఉంటుంది. ఏటీఎం కార్డుతో డౌన్పేమెంట్ లేకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనొచ్చు.