ప్రాణాలు నిలిపే దేవుళ్లు డాక్టర్లు..డాక్టర్స్ డే సందర్బంగా చేర్యాల డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రాణాలు నిలిపే దేవుళ్లు డాక్టర్లు..డాక్టర్స్ డే సందర్బంగా చేర్యాల డాక్టర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
  • యశోద హాస్పిటల్​ వారి సౌజన్యంతో ఉచిత గుండె  వైద్య శిబిరం

చేర్యాల, వెలుగు:  ఆగిపోయే ఊపిరిని నిలిపే ప్రత్యక్ష  దైవాలు డాక్టర్లని చేర్యాల సీఐ ఎల్. శ్రీను అన్నారు. మంగళవారం చేర్యాల పట్టణంలో సీడీఏ (చేర్యాల డాక్టర్స్​ అసోసియేషన్​) ఆధ్వర్యంలో డాక్టర్స్​ డే పురస్కరించుకొని యశోద హాస్పిటల్​ సౌజన్యంతో అక్షర ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్నిఏర్పాటు చేశారు. అంతకు ముందు చేర్యాల గాంధీ సెంటర్​ నుంచి విద్యార్థులు, పట్టణ ప్రజలు నాయకులతో డాక్టర్లు హనుమాన్​ టెంపుల్​ వరకు సే నో టు డ్రగ్స్​భారీ ర్యాలీ నిర్వహించారు.

టెంపుల్​వద్ద మానవహారంగా ఏర్పడి డాక్టర్స్​అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..  విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు డ్రగ్స్​కు బానిసై తమ విలువైన జీవితాలను ఆగంచేసుకోవద్దని సూచించారు. రోజులో ఒక గంట వ్యాయామం, నడక 23 గంటలు కాపాడుతుందన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రౌండ్​లో నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఎస్సై నీరేశ్, ఎంఈఓ రచ్చ కిష్టయ్య, ప్రొహిబిషనరీ ఎస్సై సమత, యశోద హస్పిటల్​ కార్డియాలజిస్ట్​ డాక్టర్​ శ్రీకాంత్, చేర్యాల డాక్టర్ల అసోసియేషన్​ ప్రెసిడెంట్​ఆర్. పరమేశ్వర్, ఉపాధ్యక్షుడు ఏడెల్లి సంతోష్​ కుమార్, ప్రధాన కార్యదర్శి తుంగ రఘునందన్​ రాణా, బాలకిషన్, సతీశ్, మేక శ్రీకాంత్, స్థానిక నాయకులు పి.ఆగంరెడ్డి కళావతి, అందె నానిబాబు, శ్రీధర్​రెడ్డి, శ్రీధర్​, అందె అశోక్​, యం. నాగేశ్వర్​రావు, పి. వెంకట్​రెడ్డి, పి. లక్ష్మీనారాయణ, డి. శ్రీకాంత్​, బి. సత్యనారాయణ, సదానందం, శ్రీకాంత్​, జహూరుద్దీన్​, రామాంజనేయులు పాల్గొన్నారు.