
భైంసా, వెలుగు: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై యుద్ధంలో సత్తాచాటిన భారత జవాన్లు, త్రివిధ దళాల ధైర్య సాహసలను స్మరించుకుంటూ భైంసాలో a, కులమతాలకు అతీతంగా మంగళవారం భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక లక్ష్మి వెంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్తో పాటు పలువురు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది.
సైనికులు, భారత మాత వేషధారణలో చిన్నారులు ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత సైనిక సత్తా తెలిసిందన్నారు. యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. యాత్రలో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, రిటైర్ట్ ఉద్యోగులు, రిటైర్డ్ సైనికులు, ఆయా పార్టీల నేతలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
మోహన్రావు పటేల్ ఆధ్వర్యంలో..
బోస్లే మోహన్రావు పటేల్ నేతృత్వంలోని మోహన్రావు ప్రజా ట్రస్టు ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో తిరంగా యాత్ర చేపట్టారు. దారాబ్జీ జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది.