వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుని మృతి.. మెదక్ ​జిల్లా పాపన్నపేటలో విషాదం

వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుని మృతి.. మెదక్ ​జిల్లా పాపన్నపేటలో విషాదం

పాపన్నపేట, వెలుగు : మెదక్​జిల్లా పాపన్నపేట మండలం మిన్​పూర్​గుట్టల్లో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి బండరాళ్ల సందులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి కథనం ప్రకారం..కామారెడ్డి మండలం గాలిపూర్​కు  చెందిన అల్లం రాజయ్య (45) బతుకుదెరువు కోసం 25 ఏండ్ల కింద పాపన్నపేటకు వచ్చాడు. భార్య సుగుణమ్మతో పాటు ముగ్గురు బిడ్డలు, కొడుకు ఉన్నారు. రాజయ్య చేపలు పట్టడంతో పాటు అప్పుడప్పుడూ అడవిలో వేటకు వెళ్తుండేవాడు.

 గత నెల 17న వేటకు వెళ్లిన రాజయ్య తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఆదివారం మిన్ పూర్ గుట్టల్లో బండరాళ్ల మధ్య ఓ అస్థి పంజరాన్ని మేకల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ దొరికిన గడ్డపార, బట్టల ఆధారంగా ఆ శవం రాజయ్యదిగా గుర్తించారు. పోలీసులు అక్కడే శవ పంచనామా నిర్వ హించి కేసు నమోదు చేశారు.