కాల్పుల ఘటనపై రిటైర్ట్ సీఐ వివరణ…

కాల్పుల ఘటనపై రిటైర్ట్ సీఐ వివరణ…

అక్కన్న పేటలో ఏకే47 గన్ తో జరిగిన కాల్పుల ఘటనపై రిటైర్డ్ సీఐ భూమయ్య మీడియాతో మాట్లాడారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… రెండు సంవత్సరాల క్రితం హుస్నాబాద్ పోలీస్టేషన్ నుంచి తుపాకులు మాయమైన ఘటనపై మాట్లాడారు. తాను హుస్నాబాద్ నుంచి బదిలీ అయిన రెండునెలల తర్వాత తుపాకులు మాయమయ్యాయని చెప్పారు. తుపాకులతో సంబంధంలేని తన గన్ మెన్ పై కొందరు అధికారులు తప్పును నెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. బులెట్ పోతెనే కఠిన చర్యలు తీసుకునే డిపార్ట్ మెంట్  రెండు తుపాకులు పోయినా అప్పుడు ఎందుకు పట్టంచుకోలేదని ప్రశ్నించారు. పైగా తనపైనే తుపాకుల దొంగతనం మోపి మానసికంగా పై అధికారులు వేధించారని చెప్పారు. తుపాకులు పోవడానికి అప్పటి ఎస్సై దే నిర్లక్ష్యమని…  పోలీస్ స్టేషన్ గార్డును తొలగించడమే దొంగతనానికి కారణమని తెలిపారు. సదానందం కాల్పులు జరగక పోయివుంటే ఆ నింద నామీదే ఉండేదని అన్నారు. అప్పటి సిద్ధిపేట సీపీ శివకుమార్ తో ఉన్న విభేదాల కారణంగానే తనపై కక్ష సాధింపు జరిగిందని చెప్పారు. తుపాకులు టెర్రరిస్టుల చేతికి, నక్సల్స్ చేతికి పోయివుంటే ఏమయ్యేదని అన్నారు. ఒక వేల సదానందం ఆటోమోడ్ లో పెట్టి ఫైర్ చేస్తే చాలా విధ్వంసం జరిగేదని తెలిపారు.