
- ఇన్ ఫ్లో 1,167.. అవుట్ఫ్లో 778 క్యూసెక్కులు
- ఉస్మాన్సాగర్లో 1,782 .80,
- హిమాయత్సాగర్లో 1,761.20 అడుగుల నీళ్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుకు నిండుకుండలా మారింది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్నది. సాగర్ ఎఫ్ టీఎల్లెవెల్ 513.41 మీటర్లు కాగా..రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు నీటిమట్టం 513.20 మీటర్లకు చేరుకుంది. దీంతో వచ్చిన నీటిని తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ఈ వరద అశోక్ నగర్, దోమలగూడ, అంబర్పేట, గోల్నాక ద్వారా మూసీలో కలుస్తోంది.
కాగా, శుక్రవారం రాత్రి వరకు ఇన్ఫ్లో 1,167 క్యూసెక్కులు ఉండగా, 778 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నది. దీంతో ఎఫ్టీఎల్దాటకుండా వాటర్ లెవెల్ ను మెయింటెన్ చేస్తున్నారు. వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. వర్షాలు మరింత ఎక్కువైతే లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. 2022లో భారీ వర్షాల కారణంగా హుస్సేన్సాగర్నీటి మట్టం 513.43కి చేరుకోగా, 2023 సెప్టెంబర్5న 513.41 కి చేరింది. అలాగే, 2024లో గరిష్టంగా 513.60 అడుగులకు వచ్చింది.
జంట జలాశయాలు ఇలా..
శుక్రవారం ముసురుతో జంట జలాశయాల్లోకి పెద్దగా నీరు చేరలేదు. దీంతో ప్రస్తుతం నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. ఉస్మాన్సాగర్పూర్తి స్థాయి కెపాసిటీ 1,790 అడుగులు(3.900 టీఎంసీ) కాగా, ప్రస్తుతం1,782.80 అడుగుల (2.474 టీఎంసీ) నీళ్లున్నాయి. ఇన్ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ఇక హిమాయత్సాగర్నిల్వసామర్థ్యం 1,763.50 అడుగులు(2.970 టీఎంసీ)కాగా, ప్రస్తుతం1,761.20 అడుగుల(2.471 టీఎంసీ)నీళ్లు చేరాయి. ఇన్ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉంది.