
హుజూర్ నగర్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల
ఇవాళ్టి నుంచి నామినేనషన్లు ప్రారంభం
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు….. నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు రిటర్నింగ్ అధికారులు. సూర్యాపేట DRO ను రిటర్నింగ్ అధికారిగా నియమించింది ఈసీ. హుజూర్ నగర్ తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ల స్వీకరించనున్నారు. దీంతో తహశీల్దార్ ఆఫీసు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురు సభ్యులను మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య.