హైదరాబాద్ ఏసీబీ వలలో విద్యుత్ అధికారి

హైదరాబాద్ ఏసీబీ వలలో విద్యుత్ అధికారి

గండిపేట, వెలుగు: ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. బండ్లగూడ జాగీరు పరిధిలోని ఏఆర్​సీకే అపార్ట్​మెంట్​లో కొత్త ట్రాన్స్​ఫార్మర్​నిర్మించడానికి హిమాయత్​సాగర్ సెక్షన్​లో అసిస్టెంట్ ఇంజినీర్‌ అమర్‌సింగ్ రూ.30 వేల లంచం డిమాండ్​చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, శనివారం డబ్బులు తీసుకుంటుండగా నిందితుడిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.