డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన అంబులెన్స్.. ఎగిరిపడ్డ డ్రైవర్..

డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన అంబులెన్స్.. ఎగిరిపడ్డ డ్రైవర్..

హైదారాబాద్ బీఎన్ రెడ్డి నగర్లో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ మల్లేష్ అంబులెన్స్ నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇబ్రహంపట్నం నుండి ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగాఈ  ఘటన జరిగింది.

డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టిన  అంబులెన్స్ ను ను పక్కకు తీస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో అంబులెన్స్ లోని  ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో పూర్తిగా అంబులెన్స్ దగ్ధమైంది.