
- సన్న బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర కూడా..
- మూడుసార్లు వేలిముద్రలు వేసి, ఒక్కో రోజు గ్యాప్తో తీసుకోవాలి
- ఈ నెల 30 వరకు అవకాశం
- సివిల్ సప్లయీస్ అధికారుల ప్రకటన
హైదరాబాద్సిటీ/పద్మారావునగర్, వెలుగు: గ్రేటర్లో మూడు నెలల రేషన్పంపిణీ ఆదివారం నుంచి మొదలైంది. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో అందించే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈసారి సన్న బియ్యంతో పాటు మూడు నెలలకు సరిపడా గోధుమలు, చక్కెర కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 30 తేదీ వరకు రేషన్ఇవ్వనున్నామని, డీలర్లు నెల మొత్తంలో మూడుసార్లు బయోమెట్రిక్ తీసుకుని సన్న బియ్యం ఇస్తారని చెప్పారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్షాపులు తెరిచి ఉంటాయన్నారు. ఈసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి ఇస్తున్నందున మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకని, ఒక్కో రోజు గ్యాప్ ఇచ్చి సరుకులు తీసుకోవాలని కోరారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి రేషన్ దుకాణాల వద్ద తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో బ్యానర్లు ఏర్పాటు చేశామని, సాఫ్ట్వేర్ అప్డేట్ లోపం కారణంగా ఆలస్యమైతే సంయమనం పాటించాలని సికింద్రాబాద్సహాయ పౌరసరఫరాల శాఖాధికారి ఏఆర్ కృష్ణవేణి కోరారు.
ఆరున్నర లక్షల కార్డులు..
జంటనగరాల్లోని 6,47,282 ఆహార భద్రతా కార్డులు ఉండగా, 24,24,824 మంది లబ్ధిదారులున్నారు. జూన్నెలకు గాను 45,259.677 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం, 9,709.230 మెట్రిక్టన్నుల గోధుమలు, 88.695 మెట్రిక్టన్నుల చెక్కర కేటాయించామని రమేశ్చెప్పారు. ఆహార భద్రత కార్డుదారులైతే ఒక్కో వ్యక్తికి 6 కిలోలు అంటే మూడు నెలలకు 18 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు అంటే మూడు నెలలకు 105 కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున 30 కిలోలు
అందజేస్తున్నామన్నారు.
ఈపాస్ రసీదులు ఇస్తున్నాం
మూడు నెలల రేషన్బియ్యంతో పాటు ఈసారి ప్రతి కార్డుదారుడికి మూడు నెలలకు గాను గోధుమలు, చక్కెర కూడా ఇస్తున్నాం. 5 కిలోల చొప్పున 15 కిలోల గోధుమలు రూ.7కు కిలో చొప్పున , 3 కిలోల చక్కెర 13.50 రూపాయలకు అందజేస్తున్నాం. కార్డుదారులందరికీ పంపిణీ టైంలో ఈపాస్రసీదులు మూడు నెలలకు విడిగా ఇస్తున్నాం. – రమేశ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి