
- నిర్మాణ రంగంలో సమూల మార్పులకు ఎల్ఏడీపీ
- ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా విధివిధానాలు
- దీనికి తోడు మరో మూడు మాస్టర్ప్లాన్ల మ్యాపింగ్
హైదరాబాద్సిటీ, వెలుగు: ట్రిపుల్ఆర్వరకూ విస్తరిస్తున్న హైదరాబాద్నగరాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణ రంగంలో సమూల మార్పులు చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్రంగానికి దిశానిర్దేశం చేసేందుకు లోకల్ఏరియా డెవలప్మెంట్ప్లాన్(ఎల్ఏడీపీ)ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధివిధానాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎల్ఏడీపీని రూపుదిద్దే పనులు ఒక కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్టు సమాచారం. ఎల్ఏడీపీ అమలులోకి వస్తే హెచ్ఎండీఏ లేఅవుట్లతో పాటు, ప్రైవేట్ లేఅవుట్స్, వెంచర్లలో తప్పనిసరిగా రోడ్లు, ఇతర సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భూసేకరణ నుంచి మొదలుకుంటే టౌన్షిప్ల నిర్మాణం వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
మెగా మాస్టర్ప్లాన్–2050లో భాగంగా ఈ ఎల్ఏడీపీని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాలు నగరీకరణకు నోచుకోవడం లేదు. భవిష్యత్లో వాటి రూపురేఖలు మారే అవకాశం ఉన్నందున ఎల్ఏడీపీ కీలకం కానున్నది.
డిసెంబర్నాటికి మూడు ప్లాన్లు పూర్తి
హెచ్ఎండీఏ మెగా మాస్టర్ప్లాన్–2050లో భాగంగా ప్రతిపాదించిన మూడు ప్లాన్ల మ్యాపింగ్పనులను కూడా చేపట్టాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో కామన్మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ), స్పెషల్ఎకానమికల్ డెవలప్మెంట్ ప్లాన్, బ్లూ అండ్గ్రీన్ ఏరియా ప్లాన్ల మ్యాపింగ్ తుదిదశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నుంచి మ్యాపింగ్ పనులు చేపట్టి డిసెంబర్నాటికి ఈ ప్లాన్లను కంప్లీట్ చేయనున్నారు.
రైతులకు 60 శాతం
ట్రిపుల్ఆర్వరకూ నగర పరిధి విస్తరించినప్పటికీ అనేక ప్రాంతాలు ఇంకా నగరీకరణకు దూరంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భవిష్యత్అవసరాలకు అనుగుణంగా టౌన్షిప్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఔటర్నుంచి ట్రిపుల్ఆర్వరకు రేడియల్రోడ్లు, టౌన్షిప్లు అందుబాటులోకి వచ్చే చాన్స్ఉంది.
ఇందులో భాగంగా నగరీకరణకు దూరంగా ఉన్న గ్రామాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం వారికి, మరో 40 శాతం హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ఇందులో 30 శాతం రోడ్లు, పార్కులు, దవాఖానలు, స్కూళ్లు, కాలేజీలు, విద్యుత్ కేంద్రాలకు కేటాయిస్తారు. 10 శాతం హెచ్ఎండీఏ ల్యాండ్బ్యాంక్అవసరాలకు వినియోగిస్తారు. ఈ మేరకు త్వరలో కాంప్రహెన్సీవ్ ల్యాండ్పూలింగ్ పాలసీ కూడా తీసుకురానున్నారు.
ఏ ప్లాన్ ఎందుకోసం ?
కామన్ మొబిలిటీ ప్లాన్లో భాగంగా ట్రిపుల్ఆర్వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పబ్లిక్ట్రాన్స్పోర్ట్సదుపాయాలను అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాల మేరకు ఏ ప్రాంతంలో ఏ విధమైన ప్రజా రవాణా అవసరమనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. అలాగే స్పెషల్ఎకానమికల్డెవలప్మెంట్ప్లాన్(ఎస్ఈడీపీ)లో భాగంగా పారిశ్రామిక, లాజిస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.
ట్రిపుల్ ఆర్వరకు నీటి వనరులు, అడవులను గుర్తించేందుకు బ్లూ అండ్గ్రీన్ప్లాన్పై దృష్టి పెట్టారు. 2050 వరకు హైదరాబాద్అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు ప్లాన్లపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇందు కోసం త్వరలో కన్సల్టెన్సీలను నియమించనున్నది.