వర్షం పడుతున్నప్పుడు ప్రజలు బయటికి రావొద్దు! : మంత్రి పొన్నం ప్రభాకర్

వర్షం పడుతున్నప్పుడు ప్రజలు బయటికి రావొద్దు! : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వానలు పడుతున్నప్పుడు బయటికి రావొద్దని హైదరాబాద్ ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ శాఖల ఆఫీసర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

 3  రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల కన్న తక్కువ సమయంలో కుంభవృష్టిగా పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. సిటీలోని మ్యాన్​హోల్స్​ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు.