ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల దందా.. ఎక్కడ పుట్టినా హైదరాబాద్ సిటీ నుంచి బర్త్​ సర్టిఫికెట్ల జారీ

ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల దందా.. ఎక్కడ పుట్టినా హైదరాబాద్ సిటీ నుంచి బర్త్​ సర్టిఫికెట్ల జారీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలోని కొందరు అధికారులు డబ్బులకు ఆశపడి ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలు నగరంలో జన్మించినట్టు ఫేక్​బర్త్​సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్టు తేలింది. అలాగే, కొన్ని హాస్పిటల్స్​ కూడా వారికి ఇచ్చిన లాగిన్​ఐడీలను మిస్​యూజ్​చేస్తూ ఫేక్​బర్త్​సర్టిఫికెట్లు పొందుతున్నట్టు తెలిసింది. గతేడాది హోమ్ బర్త్ లకి సంబంధించి ఒకేసారి 74  దరఖాస్తులు రాగా, అప్పటి కమిషనర్ ఇలంబరితి అనుమానంతో విచారణకు ఆదేశించారు. ఈ ఎంక్వైరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఇందులో ఫలక్ నుమా సర్కిల్​లో మూడు, మలక్ పేట్ సర్కిల్​లో ఒక ఫేక్​హోమ్​బర్త్​సర్టిఫికెట్​జారీ చేసినట్టు గుర్తించారు. దీంతో ఈ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు షోకాజ్​నోటీసులివ్వడంతో పాటు ఓ హెల్త్ అసిస్టెంట్, మరో కప్యూటర్ ఆపరేటర్ ను విధుల నుంచి తొలగించారు. 

ఏపీలో పుట్టినవాళ్లకు కూడా..
ఫేక్​సర్టిఫికెట్లు పొందిన వారిలో ఒకరు ఏపీలోని వెస్ట్ గోదావరి ఆచంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డెలివరీ కాగా, మరొకరు కర్నూల్ జిల్లాలోని నాగరూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రసవించినట్టు గుర్తించారు. ఇంకొకరు మెదక్ జిల్లా జిన్నారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో పుట్టగా..నగరంలోని ఓ ఇంట్లో పుట్టినట్టు సర్టిఫికెట్ పొందారు. ఇంకొకరైతే ఓ బిడ్డను దత్తత తీసుకొని తనకే ఇంట్లో బిడ్డ పుట్టిందని హోమ్ బర్త్ సర్టిఫికెట్ పొందారు.

అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ కాగా, ఇక్కడ ఇదివరకే బర్త్ సర్టిఫికెట్ పొందారు. తర్వాత బిడ్డను కన్నతల్లి తన చెల్లికి దత్తత ఇచ్చింది. తర్వాత ఆ చెల్లెలు ఆ బిడ్డ తనకే పుట్టిందని హోమ్ బర్త్  సర్టిఫికెట్ తీసుకుంది. ఈ అడాప్షన్ లీగల్ అయితే జీహెచ్ఎంసీ అధికారికంగా బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ, వీరు ఇల్లీగల్ గా సర్టిఫికెట్ పొందడంతో ఫేక్ గా గుర్తించారు. ఈ నాలుగు సర్టిఫికెట్లను రద్దు చేయడంతో పాటు పేరెంట్స్ పై ఆయా పీఎస్​లలో జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు.  

హాస్పిటల్ ​క్లోజ్​అయినా సర్టిఫికెట్ల జారీ
ఎక్కువగా ఫేక్​బర్త్, డెత్​సర్టిఫికెట్లు హాస్పిటల్స్ నుంచే జారీ అవుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఒక్క టోలీచౌకీలోని మెట్రో హాస్పిటల్ లోనే 65 ఫేక్​బర్త్, 8 ఫేక్​డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఎలాంటి డాక్యుమెంట్ల లేకుండానే, ఆఫీసర్లను, సిబ్బందిని మేనేజ్ చేసుకున్న హాస్పిటల్​నిర్వాహకులు సర్టిఫికెట్లు పొందారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ హాస్పిటల్ క్లోజ్ అయినా సర్టిఫికెట్లు జారీ అవుతునట్టు తెలుసుకున్నారు.

ఈ హాస్పిటల్ లాగిన్ ఐడీ రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సంబంధిత శాఖను బల్దియా అధికారులు కోరారు. హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీని తర్వాత అసలు ఇటువంటివి ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. ఈ ఎంక్వైరీలో బర్త్ అండ్ డెత్ కి సంబంధించిన రిజిస్ర్టేషన్ లాగిన్ ఐడీలు పొంది ఇన్ యాక్టివ్ గా ఉన్న 510 హాస్పిటల్స్ లాగిన్ ఐడీలు రద్దు చేశారు. ఇలా గ్రేటర్ లో 1823 ఐడీలు జారీ చేయగా, అందులో 510 రద్దు చేశారు. 

కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు
బర్త్అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల తరుచూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.  దీంతో కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తే అక్రమాలకు చెక్ పడుతుందని బల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను అమల్లోకి తేవాలనుకుంటున్నారు.


దేశవ్యాప్తంగా ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఓఆర్ జీఐ) ఆధ్వర్యంలోని ఈ పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది.  ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం జీహెచ్ఎంసీ వెయిట్ చేస్తోంది. దీనికి అనుమతులివ్వాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎంఏయూడీ శాఖకు రెండు వారాల కింద లెటర్​రాశారు. ఈ అనుమతులు రాగానే కేంద్రాన్ని సంప్రదించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.