
- ముందు గోల్కొండ నుంచి కుతుబ్షాహి టూంబ్స్వరకు
- తర్వాత ట్యాంక్బండ్, మీరాలం ట్యాంక్ వద్ద ఏర్పాటు
- టూరిజం డెవలప్మెంట్, ట్రాఫిక్ సమస్యలకు చెక్
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలో టూరిజం డెవలప్చేయడానికి, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూనిఫైడ్మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఉమ్టా) అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పర్యాటక శాఖతో కలిసి నగరంలోని టూరిస్టు ప్రాంతాల్లో రోప్వే ఏర్పాటు చేయాలని ప్లాన్చేస్తున్నారు.
బాక్స్లాంటి వాహనంలో తీగలపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేలా రోప్వే నిర్మాణం ఉంటుంది. ఒక్కో బాక్స్లో ఆరు నుంచి పది మంది ప్రయాణిస్తారు. గ్రేటర్లో ట్రాఫిక్సమస్య తీవ్రంగా వేధిస్తుండడంతో దీన్ని అధిగమించడం, విదేశీయులను, ఇతర రాష్ట్రవాసులను ఆకట్టుకోవడానికి ఈ ప్రాజెక్టుకు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్టా ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గతంలోనూ ఈప్రాజెక్టుపై చర్చ జరిగినా అమల్లోకి రాలేదు. తాజాగా నగరం విస్తరిస్తుండడం, పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ముందు అక్కడే..
రోప్వే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ముందు గోల్కొండ–కుతుబ్షాహి టూంబ్స్మధ్య నిర్మించాలని భావిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతాలకు రోజూ వందలాది మంది దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో రోజూ ట్రాఫిక్ ఎక్కువగానే ఉండడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటారు.
కానీ రోప్వే నిర్మాణం జరిగితే గోల్కొండను విజిట్ చేసిన వారు నేరుగా ఆకాశ మార్గాన కుతుబ్షాహి టూంబ్స్కు చేరుకోవచ్చు. అయితే, ఇక్కడ మిలిటరీ ప్రాంతం ఉండడం వల్ల అలైన్ మెంట్ఎక్కడి నుంచి తీసుకోవాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్అయితే, సంజీవయ్య పార్కు, ట్యాంక్బండ్, మీరాలం ట్యాంక్, కొత్వాల్గూడ వద్ద నిర్మించిన ఎకో పార్క్వద్ద కూడా ఈ రోప్వేలను నిర్మించాలని చూస్తున్నారు.