- 60 సర్కిళ్లుగా 23 డివిజన్లు
- 300 వార్డులు కానున్న 100 సెక్షన్లు
- జాయింట్ ఎండీగా ‘ఈడీ’
- సర్కారుకు ప్రతిపాదనలు.. త్వరలో నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: బల్దియాలో శివారు ప్రాంతాల విలీనం నేపథ్యంలో వాటర్ బోర్డును కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ మాదిరిగానే బోర్డును కూడా మూడు ప్రధాన జోన్లుగా విభజించనున్నది. ప్రస్తుతం గ్రేటర్లో 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తుండగా, 2030 నాటికి 850 ఎంజీడీల వరకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తోంది.
అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు కూడా రానున్నాయి. ఇప్పటికే గోదావరి రెండో, మూడో దశ పనులు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే మరో 350 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా బోర్డు పునర్విభజనకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అంఈదజేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే బోర్డు రూపు రేఖలు మార్చివేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
మూడు జోన్లుగా ఏర్పాటుకు ప్రతిపాదనలు
జీహెచ్ఎంసీ మాదిరిగానే పూర్తిస్థాయిలో మెట్రోవాటర్బోర్డును పునర్విభజన చేయనున్నారు. దీనికి సంబంధించి వాటర్బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం బోర్డును మూడు ప్రధాన జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్లుగా ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయం నుంచే పరిపాలన వ్యవహారాలను ఎండీ పర్యవేక్షణ చేయనున్నారు.
మూడు ప్రధాన జోన్లలో ఒక్కో జోన్ పరిధిలో మరో నాలుగు సబ్ జోన్లు రానున్నాయి. అంటే ప్రస్తుతం జీహెచ్ఎంసీ మాదిరిగానే ఇందులోనూ 12 జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న 23 డివిజన్లను 60 సర్కిళ్లుగా చేస్తారు. ప్రస్తుతం ఉన్న 100 సెక్షన్లను 300 వార్డులు చేయనున్నారు. ప్రధాన జోన్లలో ఈస్ట్జోన్ను ఎల్బీ నగర్ లేదా సాహెబ్ నగర్ను కేంద్రంగా పని చేయనున్నది.
వెస్ట్ జోన్ హైదర్నగర్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ జోన్గా ప్రస్తుతం ఉన్న ఖైరతాబాద్ఆఫీసును లేదా ఎస్ఆర్నగర్లోని ఆఫీసును ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతమున్న డివిజన్లను సర్కిళ్లుగా మార్చనున్నారు. ఒక్కో ప్రధాన జోన్పరిధిలో 5 నుంచి 7 సర్కిళ్లను కలుపనున్నారు. ఒక్కో సర్కిల్ పరిధిలో 17 నుంచి 29 వార్డులు ఏర్పాటు చేస్తారు.
ఈడీ పోస్ట్ అప్గ్రేడ్
ప్రస్తుతమున్న ఈడీ పోస్టును అప్ గ్రేడ్ చేసి జాయింట్ ఎండీగా కొనసాగిస్తారు. ఒక్కో ప్రధాన జోన్ లో ఈడీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డైరెక్టర్లు ఉంటారు. ఈ మేరకు కొత్తగా మూడు ఈడీ పోస్టులకు ప్రభుత్వానికి నివేదించారు. ఇలా పూర్తిస్థాయిలో మెట్రోవాటర్బోర్డును పునర్విభజన చేయడం ద్వారా బల్దియా విస్తరిత ప్రాంతాలన్నింటిలోనూ వాటర్బోర్డు ద్వారా తాగునీరు, మురుగునీటి వ్యవస్థను
నిర్వహించనున్నారు.
12 సబ్జోన్లు ఇవే..
వాటర్బోర్డు ఏర్పాటు చేసే మూడు ప్రధాన జోన్లలో ఒక్కో జోన్ పరిధిలో నాలుగేసి సబ్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ సబ్జోన్ల కింద సర్కిళ్లు, సర్కిళ్ల పరిధిలో వార్డు కార్యాలయాలు పని చేస్తాయి.
సబ్జోన్లు సర్కిళ్లు వార్డులు
1.మల్కాజిగిరి 5 26
2.ఉప్పల్ 5 24
3.ఎల్బి నగర్ 4 24
4.శంషాబాద్ 4 17
5.రాజేంద్ర నగర్ 6 29
6.చార్మినార్ 5 25
7.గోల్కొండ 5 26
8.ఖైరతాబాద్ 5 25
9.సికింద్రాబాద్ 5 28
10.శేరిలింగంపల్లి 5 26
11.కూకట్పల్లి 4 23
12.కుత్బుల్లాపూర్ 7 27
