
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టర్ హరిచందన బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పురాణాపూల్లోని అఫ్జల్గంజ్ ప్రభుత్వ హైస్కూల్ ను విజిట్ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్వీ నగర్హౌసింగ్బోర్డు కాలనీలోని పురాతన బిల్డింగులను పరిశీలించారు. 50 ఏండ్లుగా శిథిలమైన బిల్డింగుల్లో ఉంటున్నామని స్థానికులు చెప్పగా, డబుల్ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
బహదూర్పురలోని పురాణపూల్, కిషన్బాగ్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను విజిట్చేసి రోగులతో మాట్లాడారు. అనంతరం బహదూర్పురా తహసీల్దార్ ఆఫీసును తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, తహసీల్దార్ బాలశంకర్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికళ, మెడికల్ ఆఫీసర్ బుష్రా అంజుమ్, ల్యాబ్ మేనేజర్ సంగీత, అఫ్జల్గంజ్ హైస్కూల్హెచ్ఎం పద్మజా కుమారి ఉన్నారు.