బ‌‌మృక్ చెరువు వందల ఏండ్ల నాటిది..పునరుద్దరించాలి : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

బ‌‌మృక్ చెరువు వందల ఏండ్ల నాటిది..పునరుద్దరించాలి : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  • దీనిని భావిత‌‌రాల‌‌కు అందించాలి
  • హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాత‌‌బ‌‌స్తీలోని బ‌‌మృక్​నుద్దౌలా చెరువు పున‌‌రుద్ధర‌‌ణ ప‌‌నుల‌‌ను హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్  ఏవీ రంగ‌‌నాథ్  మంగ‌‌ళ‌‌వారం క్షేత్ర స్థాయిలో ప‌‌రిశీలించారు. వంద‌‌ల ఏండ్ల చ‌‌రిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంప‌‌ద‌‌గా భావిత‌‌రాల‌‌కు అందించాల్సిన అవ‌‌స‌‌రం ఉందన్నారు. 18 ఎక‌‌రాల‌‌కు పైగా ఉన్న ఈ చెరువు కేవ‌‌లం 4.12 ఎక‌‌రాల‌‌కు ప‌‌రిమిత‌‌మైపోయిందని, గ‌‌తేడాది ఆగ‌‌స్టు నెల‌‌లోనే ఈ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను తొల‌‌గించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇప్పుడు చెరువును 18 ఎక‌‌రాల మేర విస్తరించి, వ‌‌ర‌‌ద క‌‌ట్టడితోపాటు భూగ‌‌ర్భ జ‌‌లాలు స‌‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌‌న్నారు. చెరువులోకి వ‌‌ర‌‌ద నీరు చేరేలా.. నిండితే పోయేలా నిర్మించిన ఇన్లెట్‌‌లు, ఔట్​లెట్లను కమిషనర్  ప‌‌రిశీలించారు. చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్​లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. చెరువు క‌‌ట్ట చుట్టూ ఫెన్సింగ్,  చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు, వృద్ధులు సేద దీరే విధంగా  సీటింగ్ ఏర్పాటు చేయ‌‌డంతో పాటు పార్కులు నిర్మిస్తున్నామన్నారు.

 ఓపెన్ జిమ్​ల ఏర్పాటు, చెరువు చుట్టూ ర‌‌హ‌‌దారులు నిర్మించ‌‌డంతో పాటు  గ్రీన‌‌రీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.  నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్​ను చెక్కు చెద‌‌ర‌‌కుండా కాపాడుతూ.. మ‌‌రింత ప‌‌టిష్టం చేస్తున్నామన్నారు.