దుర్గం చెరువులో దుర్గంధం.. వాకింగ్ ట్రాక్పై క్షణం నిలబడ లేని దుస్థితి.. మెయింటెనెన్స్ లేకనే..

దుర్గం చెరువులో దుర్గంధం.. వాకింగ్ ట్రాక్పై క్షణం నిలబడ లేని దుస్థితి.. మెయింటెనెన్స్ లేకనే..

మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్కు మణిహారంగా ఉన్న దుర్గం చెరువు దుర్గంధం వెదజల్లుతోంది. మెయింటెనెన్స్ లేక చెరువు పరిసరాలు అధ్వాన్నంగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగు నీరు వచ్చి చెరువులో చేరుతోంది. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ పైకి సైతం మురుగు చేరడంతో వాకర్స్ నడవలేని దుస్థితి నెలకొంది. కనీసం ఒక్క క్షణం నిలబడలేనంత దుర్వాసన వస్తుందని వాకర్స్ వాపోతున్నారు. చెరువు దుస్థితిపై పలువురు తెలంగాణ సీఎంఓ, జీహెచ్ఎంసీ మేయర్, జలమండలి, ఉన్నతాధికారులకు ‘ఎక్స్’ లో ఫిర్యాదులు చేశారు. వాకింగ్ ట్రాక్​పై చేరిన మురుగు నీటి ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.