జంట జలాశయాలకు తగ్గిన వరద

జంట జలాశయాలకు తగ్గిన వరద

జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు పడక పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయాలకు సంబంధించి ఉస్మాన్​సాగర్​ పది గేట్లను, హిమాయత్​ సాగర్​కు సంబంధించి 6గేట్లను అధికారులు మూసీ వేశారు.

 ప్రస్తుతం పరీవాహక ప్రాంతాల నుంచి తక్కువగానే వరదనీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​ నుంచి 2050 క్యూసెక్కులు, హిమాయత్​ సాగర్​ నుంచి 1850 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కి 1100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 884 క్యూసెక్కుల అవుట్​ ఫ్లో వుంది.  హిమాయత్ సాగర్ కి 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 3,851 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వుంది.