న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో తెలుగు రాష్రాల టీమ్ కిరాక్ హైదరాబాద్ టాప్ లేపింది. లీగ్ దశలో పది మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించిన హైదరాబాద్ 137 పాయింట్లతో టాప్ ప్లేస్తో సెమీఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ చివరి మ్యాచ్లో హైదరా బాద్ 13-9తో ముంబై మజిల్ జట్టుపై గెలిచింది. సీజన్లో వరుసగా ఏడో విక్టరీ సాధించిన హైదరాబాద్ శనివారం జరిగే సెమీఫైనల్లో రోహతక్ రౌడీస్తో తలపడనుంది. మరో మ్యాచ్లో కొచ్చి కెడిఎస్తో ముంబై పోటీపడనుంది.
